Ticker

6/recent/ticker-posts

Ad Code

కోరుమానుపల్లె గ్రామ సవిూపంలో వైభవంగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట


కొలిమిగుండ్ల, జనవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : కొలిమిగుండ్ల మండలంలోని కోరుమానుపల్లె గ్రామ సవిూపంలో నూతనంగా నిర్మించిన పట్టాభిరామ ఆలయంలో ఏకశిలా శ్రీరాముని విగ్రహాన్ని సోమవారం నాడు వైభవంగా  ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఇటిక్యాల బాలిరెడ్డి, రామకృష్ణారెడ్డి, కొండయ్య గౌడ్‌ ఇంకా తదితర గ్రామాల పెద్దల ఆధ్వర్యంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తజన సందోహం మధ్య ఘనంగా ప్రతిష్టించారు. ముందుగా ఏకశిలా విగ్రహాన్ని క్రేన్‌ సహాయంతో ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల బాలిరెడ్డి, ఇటిక్యాల శేఖర్‌ రెడ్డి, కోటపాడు ఈశ్వర్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, కొండయ్య గౌడ్‌, తిమ్మనాయునిపేట కృష్ణయ్య, కుమార్‌, భూపాల్‌ రెడ్డి, ఇంకా తదితర గ్రామాల ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు