Ticker

6/recent/ticker-posts

Ad Code

అద్భుత ఫలితాల పర్వదినం Akshaya తృతీయ !

 `హిందువులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు  

అక్షయ తృతీయ? వైశాఖ శుధ్ద తదియనే అక్షయ తృతీయ గా వ్యవహరిస్తారు. అక్షయ అంటే తరగనిది, క్షయం లేనిది అని అర్థం. మహాభారతంల్లో అక్షయపాత్ర పేరు ప్రస్తావనకు వస్తుంది. ఈ పాత్ర ఉన్నవారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసం శుక్లపక్ష తదియను అక్షయ తృతీయగా పురాణాలు పేర్కొన్నాయి. త్రేతాయుగం ప్రారంభం, మహాభారత రచన ఈ రోజునే మొదలైంది. సంపదలకు అధిపతి కుబేరుడు శివుడ్ని ప్రార్థించగా లక్ష్మీ అనుగ్రహాన్ని ఈనాడే ఇచ్చినట్టు శివపురాణం తెలుపుతుంది. అక్షయ తృతీయ పండగ మన హిందువుల్లోనే కాకుండా జైనులలో కూడా చెపుకోతగ్గ పెద్ద పండగ. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం సిద్దిస్తుందని పండితుల మాట. ఈ పర్వదినాన ప్రజలు కొత్త పని ఏది ప్రారంభించినా అద్భుత ఫలితాలు దక్కుతాయని విశ్వాసం. అందుకే కొందరు ప్రజలు ఈ రోజు  కొత్త ఆస్తులు, కొత్త వస్తువులు కొనుగోలు చెయ్యడం చేస్తారు. మహిళల్లో బంగారం కొంటె లక్ష్మీ దేవి తమతోనే ఉంటుందని నమ్మకం. అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత బంగారం కొనేందుకు జనం ఎగబడతారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. మహిళలకు  బంగారం పట్ల ఉన్న సహజ ఆసక్తిని గుర్తించిన బంగారం షాపులు ఆకర్షణీయమైన ప్రకటనలతో , అక్షయ తృతీయరోజు అర్ధరాత్రి దాకా వ్యాపార్ని కొనసాగిస్తాయి. 


అయితే పండితులు మాత్రం అప్పుచేసి అక్షయ తృతీయనాడు బంగారం కొనవద్దని సలహానిస్తున్నారు. అక్షయ తృతీయ నాడు చేసిన ఏ పుణ్య కార్యానికైనా సరే నశించిపోవడం అన్నమాట ఉండదు.  అక్షయ తృతీయ విశిష్టతలుIమన పురాణాలు, పండితులు చెబుతున్న అక్షయ తృతీయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. వాటి వివరాలు క్లుప్తముగా?ఈ రోజే మహా విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని జననం.ఈ పవిత్ర దినానే త్రేతాయుగం ప్రారంభమైనదని పండితుల మాట.ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు. ఆదిశంకరుల వారు ఓ పేద వృద్ద జంట లబ్ది కోసం సృష్టిలో తొలిసారి ‘‘కనకధారాస్థవం’’ స్తుతించిన రోజు. ఈ పవిత్ర దినానే, దివ్య క్షేత్రం ‘‘బద్రీనాథ్‌’’ ఆలయ ద్వారాలు 4 నెలల దర్శన విరామం తర్వాత, పునః దర్శనార్ధమై తెరుచుకోబడతాయి. ఏఏటికాఏడు ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంబించే రోజు. గంగమ్మ భువి పై ఉద్భవించిన రోజు ఈ రోజే. అక్షయ తృతీయ నాడే వ్యాస మహర్షి ‘‘మహాభరతం’’ పవిత్ర గ్రంధాన్ని రచన ప్రారంబించిన రోజు. ఈ రోజే అమ్మ ‘‘అన్నపూర్ణ దేవి’’ అవతరించిన రోజు. అక్షయ తృతీయ పవిత్ర దినాన్నే కుబేరుడు శివానుగ్రహాన్ని పొంది మహలక్ష్మి ద్వారా అనంత సంపదను పొంది సంరక్షకుడిగా నియమింపబడ్డాడు. శ్రీకృష్ణుడు ద్రౌదపదిని దుశ్శాసునుడి నుండి కాపాడిన  రోజు. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగించి  అపార సంపదను అనుగ్రహించిన రోజు. సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో పాండవులకు ‘‘అక్షయపాత్ర’’ను ఇచ్చినరోజు. బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు