Ticker

6/recent/ticker-posts

Ad Code

Manipur ఘటనపై మండిపాటు

ఇంపాల్‌, జూలై 21, (ఇయ్యాల తెలంగాణ ):మణిపూర్‌ వైరల్‌ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌నీ కుదిపేసింది. ఇప్పటికే ఈ అమానుషానికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్టు ముఖ్యమంత్రి బైరెన్‌ సింగ్‌ ప్రకటించారు. ఆ తరవాత మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు వెల్లడిరచారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి నలుగురు అరెస్ట్‌ అయ్యారు. మహిళను వివస్త్రను చేసి లాక్కెళ్లిన వ్యక్తిని థౌబల్‌ జిల్లాలో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ వీడియోపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఎప్పుడో రెండు నెలల క్రితం ఇంత దారుణం జరిగితే...ఇన్ని రోజుల పాటు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. సోషల్‌ విూడియాలోనూ మణిపూర్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 70 రోజుల తరవాత నిందితులను అరెస్ట్‌ చేయడంపైనా మండి పడుతున్నారు. స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలతో మళ్లీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పంటించారు స్థానికులు. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉన్నట్టుండి నిందితుడి ఇంటి వద్దకు వచ్చి నిప్పంటించారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి బైరెన్‌ సింగ్‌ స్పందించారు. ‘‘ఆ వైరల్‌ వీడియో చూసిన తరవాత వెంటనే నిందితులను అరెస్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణమైన ఘటన ఇది. ఇప్పటికే కొందరిని అరెస్ట్‌ చేశాం. విచారణ కొనసాగుతోంది. చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలపై ఇలాంటి అమానుషాలకు ఇదే ముగింపు కావాలి. మహిళల్ని గౌరవించాలి’’

` బైరెన్‌ సింగ్‌, మణిపూర్‌ ముఖ్యమంత్రి 

నిందితులకు ఉరిశిక్ష వేసే యోచనలో ఉన్నామనీ తేల్చి చెప్పారు బైరెన్‌ సింగ్‌. మహిళలను అలా అవమానించడాన్ని చూసి గుండె మండిపోయిందని అన్నారు. సుమోటోగా స్వీకరించిన పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేశారని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ఇద్దరు మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన వీడియో చూసి నా గుండె మండిపోయింది. చాలా దారుణమైన చర్య ఇది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాం. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతానికి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాదు..ఉరిశిక్ష వేసే ఆలోచనలో కూడా ఉన్నాం. ఇలాంటి అమానవీయ ఘటనలకు మన సమాజంలో తావు లేదు’’


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు